హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేత పనుల్లో స్వల్పంగా దెబ్బతిన్న ఆలయం, మసీదులను ప్రభుత్వ ఖర్చులతో మళ్లీ నిర్మిస్తామంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. యునైటెడ్ ముస్లిం ఫోరం తరఫున పూర్తి ప్రకటన విడుదల చేస్తామన్నారు.
అయితే.. కూల్చివేతల సమయంలో అనుకోకుండా జరిగిన పొరపాటుగా భావించాలని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ ఖర్చులతో వాటి స్థానంలోనే కొత్తవాటిని నిర్మాస్తామని హామీ ఇచ్చారు. ప్రార్థనా మందిరాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని, కాకతాళీయంగా జరిగినదిగానే గుర్తించి సహకరించాలని కోరారు. కొత్త సెక్రటేరియట్తో పాటు ప్రభుత్వ ఖర్చుతో ఇంకా విశాలమైన మసీదు, ఆలయాన్ని నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
Detailed statement will be issued by United Muslim Forum very soon
I welcome the statement issued by @TelanganaCMO expressing government regret on the demolition of Masjids and Temples during the demolition of the Secretariat buildings— Asaduddin Owaisi (@asadowaisi) July 10, 2020