ఘోర ప్రమాదం.. నదిలో బస్సు బోల్తా

ఘోర ప్రమాదం.. నదిలో బస్సు బోల్తా

మధ్యప్రదేశ్ లోని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండోర్ నుంచి పూణేకు వెళ్తున్న మహారాష్ట్ర బస్సు ధర్ జిల్లాలోని కాల్ ఘాట్ సంజయ్ సేతు వద్ద  నర్మదా నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 12 మంది దుర్మరణం పాలయ్యారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టి 15 మంది ప్రయాణికులను రక్షించినట్లు మధ్యప్రదేశ్ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు.

ఇక నర్మదా నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు నెమ్మదిగా జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 40 మంది ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.