కోర్టు ముందే న్యాయవాదిపై దాడి.. లాయర్ల ఆందోళన

కోర్టు ముందే న్యాయవాదిపై దాడి.. లాయర్ల ఆందోళన
  • కోర్టు ముందే లాయర్ పై దాడి
  • కేసు ఫైల్ చేయడానికి వస్తుండగా లాయర్ దాడి

నాగర్ కర్నూల్ జిల్లా : కోర్టు సమీపంలోనే లాయర్ పై దాడి చేసిన సంఘటన శుక్రవారం నాగర్ కర్నల్ జిల్లాలో జరిగింది. చిన్నంబావి మండలానికి సంబంధించిన ఓ ప్రైవేట్ కేసు ఫైల్ చేయడానికి వచ్చిన లాయర్ సంతోష్ కుమార్ నాయక్ పై.. కొల్లాపూర్ కోర్టు బయట కట్టెలతో దాడి చేశారు కేసు ప్రత్యర్థులు. తీవ్ర గాయాలైన లాయర్ సంతోష్ కుమార్ నాయక్ ను హైద్రాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సంతోష్ కుమార్ నాయక్ పై దాడికి నిరసనగా విధులు బహిష్కరించి, కోర్టు గేటు ముందు ఆందోళన చేపట్టారు. ఇదే విషయంపై లాయర్లు మాట్లాడుతూ..చిన్నంబావి మండలానికి సంబంధించిన ఓ ప్రైవేట్ కేసును లాయర్ సంతోష్ కొల్లాపూర్ కోర్టులో ఫైల్ చేసి వెళ్తుండగా కోర్టు బయట కేసుకు సంబంధించిన ప్రత్యర్థులు అతడిపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి గాయపర్చారని తెలిపారు. తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్, ఉస్మానియా ఆసుపత్రికి తరిలించామన్నారు. సంతోష్ కుమార్ నాయక్ రంగారెడ్డి కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్విర్తిస్తున్నారని తెలిపారు. న్యాయం కోసం పోరాడే న్యాయవాదిపై దాడి చేయడం దారుణమని.. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ పార్లమెంటులో వెంటనే అమలు చేయాలన్నారు. చావుబతుకుల్లో ఉన్న లాయర్‌ సంతోష్ కుమార్ నాయక్‌కు భద్రత కల్పించి.. దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లాయర్లు.