పాత కక్షతో స్టూడెంట్ పై దాడి

పాత కక్షతో స్టూడెంట్ పై దాడి

మూసాపేట, వెలుగు: పాత కక్షను మనసులో పెట్టుకుని సహ విద్యార్థిపై దాడికి పాల్పడిన ఘటన కూకట్ పల్లి పీఎస్ పరిధిలో  ఆలస్యంగా తెలిసింది. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు.. జగద్గిరిగుట్ట శ్రీనివాసనగర్ లాస్ట్ బస్ స్టాప్ లో ఉండే ఫిరోజ్ కుమారుడు ఫర్దిన్ (17) కూకట్ పల్లి భాగ్యనగర్ కాలనీలోని తపస్వి కాలేజీలో ఇంటర్  సెకండ్​ ఇయర్ స్టూడెంట్. బుధవారం మధ్యాహ్నం అతడు కాలేజ్ కు వెళ్లి పార్కింగ్ నుంచి బైక్  తీసుకుని బయటకు వస్తున్నాడు. 

అదే కాలేజ్ కు చెందిన సోహెల్, షమీ తోటి విద్యార్థులు పాత కక్షతో ఫర్దిన్ ను తిట్టారు. అతడు తన తండ్రికి ఫోన్ లో చెప్పాడు. వెంటనే కాలేజ్ కు వచ్చిన ఫర్దిన్ తండ్రిని కూడా బూతులు తిట్టాడు. దీంతో తండ్రి, కొడుకు వేర్వేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్తుండగా దారిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద సోహెల్, షమీ ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి ఫర్దిన్ ముఖంపై పంచ్ లు విసిరి తీవ్రంగా కొట్టడడంతో గాయపడ్డాడు. పోలీసులకు తండ్రి ఫిరోజ్ కంప్లయింట్ చేయడంతో  కేసు నమోదు చేశారు.