ఏటీఎం సెంటర్లో చోరీకి ప్రయత్నం..పోలీసులు రాకను గుర్తించి పారిపోయిన దొంగ

ఏటీఎం సెంటర్లో చోరీకి ప్రయత్నం..పోలీసులు రాకను గుర్తించి పారిపోయిన దొంగ

రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలో నిన్న రాత్రి ఓ దొంగ వరుసగా రెండు ఏటీఎం కేంద్రాల్లో చోరీకి విఫలయత్నం చేశాడు. హైదరాబాద్ రోడ్డులో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్ ను పెట్రోలింగ్ పోలీసులు చెక్ చేసేందుకు వెళ్తుండగా.. అప్పటికే ఆ ఏటీఎంలో చోరీకి ప్రయత్నిస్తున్న దొంగ.. పోలీసుల రాకను గుర్తించి ఏటీఎం సెంటర్ అద్దాలు పగులగొట్టి పారిపోయాడు. తన ప్రయత్నం విఫలమైనా పట్టువిడువకుండా బస్టాండు వద్ద ఉన్న ఇండి క్యాష్ ఏటీఎం సెంటర్లో దూరి చోరీ కి ప్రయత్నించాడు. దొంగను వెంబడిస్తూ వెళ్లిన పోలీసులు.. నిన్న రాత్రంతా చుట్టుపక్కల ఏటీఎం సెంటర్లన్నీ తనిఖీలు చేయగా..  మరో ఏటీఎం సెంటర్ లో చోరీకి విఫలయత్నం చేసినట్లు తేలింది. ఒకే దొంగ రెండు చోట్ల ప్రయత్నించినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని  షాద్ నగర్ సీఐ శ్రీధర్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దొంగను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.