- హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. బోనాల జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని ప్రజలందరూ సుఖ, సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు బండారు దత్తాత్రేయ.