బాలిక‌పై గ్యాంగ్ రేప్, మ‌ర్డ‌ర్.. శ‌వాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో ప‌డేశారు

బాలిక‌పై గ్యాంగ్ రేప్, మ‌ర్డ‌ర్..  శ‌వాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో ప‌డేశారు

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జ‌రిగింది. ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఓ బాలిక‌పై కొంద‌రు దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అనంత‌రం ఆ బాలిక‌ను హ‌త్య చేసి, శవాన్ని ఇంటి ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్ లో పడేశారు. ఈ సంఘటన రాష్ట్రంలోని జల్పాయిగురి జిల్లాలో జరిగింది.

రాజ్ గంజ్ లోని శ్యానిశికటలో నివాసం ఉండే బాలిక(16) ఈ నెల 10వ తేదీన అదృశ్యమైంది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టి.. గురువారం నాడు ముగ్గురు వ్య‌క్తుల‌ను అరెస్టు చేశారు. పోలీసులు త‌మ‌దైన శైలిలో విచార‌ణ చేయ‌గా..  తామే అత్యాచారం చేసి హ‌త్య‌చేసిన‌ట్లు నిందితులు అంగీక‌రించారు. మృత‌దేహాన్ని ఇంట్లోని సెప్టిక్ ట్యాంక్‌లో ప‌డేసిన‌ట్లు తెలిపారు. పోలీసులు మృత‌దేహాన్ని సెప్టిక్‌ట్యాంకు నుంచి వెలికితీశారు. స్థానిక తృణ‌మూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఖ‌గేష్‌రాయ్ బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. దోషుల‌కు ఉరిశిక్ష వేయాల్సిందిగా డిమాండ్ చేశారు.