వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవడం అసాధ్యం

వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవడం అసాధ్యం

కోల్కతా: 2024 ఎన్నికలకు గేమ్ ప్లాన్ స్టార్టయ్యిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగిన టీఎంసీ కార్యకర్తల సమావేశంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యమని చెప్పారు. సోరెన్, అఖిలేశ్, నితీశ్ తో పాటు ఇతర మిత్ర పక్షాలు ఐక్యంగా ఉన్నాయని, వచ్చే ఎన్నికలు బీజేపీకి అంత ఈజీ కాదన్నారు. దేశంలో బీజేపీ అవసరం లేదన్న మమత... ప్రతిపక్షాలను ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తనను కలవాలని అనుకున్నారని, కానీ బీజేపీ నేతల ఒత్తిడితో కలవలేకపోయారని మమతా బెనర్జీ తెలిపారు. కొంతకాలంగా జాతీయ రాజకీయాలపై సైలెంట్ గా ఉంటూ వస్తోన్న మమత.. తాజాగా బీజేపీని తీవ్రంగా విమర్శించారు.