కులవృత్తులకు  చేయూతనిస్తున్నాం

కులవృత్తులకు  చేయూతనిస్తున్నాం

కులవృత్తులకు చేయూతనిస్తున్నాం
యాదాద్రి, వెలుగు : కుల వృత్తుల ద్వారా ఉపాధి పొందేందుకు టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం సహకరిస్తోందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. ఇటీవల చనిపోయిన మత్స్యకారుల ఫ్యామిలీలకు శనివారం స్థానికంగా బీమా చెక్కులను అందజేశారు. ఇటీవల వీరవెల్లి గ్రామానికి చెందిన గొడుగు చంద్రయ్య వీరవల్లి చెరువు  వద్దకు వెళ్తూ హార్ట్ఎటాక్ తో మరణించారు.  వారి కుటుంబానికి మత్స్య శాఖ నుండి మంజూరైన రూ 2  లక్షల చెక్కును  ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి భువనగిరి క్యాంపు కార్యాలయంలో అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్సకారులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతోనే చేప పిల్లలను ఫ్రీగా అందజేస్తున్నామన్నారు. ప్రమాదాలకు గురైన వారికి ప్రభుత్వం తరఫున సాయం చేస్తున్నట్లు చెప్పారు. గతంలో జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో పంచాయతీలు ఉండేవన్నారు. టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వంలో గ్రామాలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయన్నారు.  ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి ఎస్ఏ.రహమాన్,ఎంపీపీ నరాల నిర్మల,జడ్పీటీస్ బీరుమల్లయ్య,రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య,మత్య్స సంఘాల అధ్యక్షుడు పూస శ్రీను, ఫీల్డ్ ఆఫీసర్ నర్సింహరావు, ఫీల్డ్ మెన్ రవి నాయక్, వీరవెల్లి సర్పంచ్ కల్పనాశ్రీనివాసచారి, టీఆర్ఎస్ వీరవెల్లి గ్రామశాఖ అధ్యక్షుడు తోటకూరి పరమేష్ తదితరులు పాల్గొన్నారు.