దొంగల బీభత్సం.. 15 తులాల బంగారం.. 2 కిలోల వెండి చోరీ

దొంగల బీభత్సం.. 15 తులాల బంగారం.. 2 కిలోల వెండి చోరీ

 వికారాబాద్ జిల్లాలో దొంగలు భీపత్సం సృష్టించారు. పరిగిలోని ఫీచర్స్ కాలనీలో మొదట 6 ఇండ్లలో భారీ చోరీ జరిగింది. తాళం వేసున్న ఓ జునియర్ కాలేజీ లెక్చరర్ ఇంట్లోకి చొరబడి భారీగా దోచుకున్నారు కేటుగాళ్లు. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం.. ఇంట్లోని 15 తులాల బంగారం,2 కిలోల వెండి, లక్షా 25 వేల నగదు చోరి అయ్యిందని చెప్పారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు బాధితులు.  

క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆనవాళ్లు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దొంగలను గుర్తించే పనిలో పడ్డారు. తాళం వేసిన ఇళ్ళే టార్గెట్ గా చోరీలు చేయడంతో ఇంటికి తాళం వేసి వెళ్ళాలంటే భయమేస్తుందని కాలనీ వాసులు వాపోతున్నారు.