శిల్పారామంలో ఈ నెల 25వరకు బిహార్ క్రాఫ్ట్ ఫెయిర్

శిల్పారామంలో ఈ నెల 25వరకు బిహార్ క్రాఫ్ట్ ఫెయిర్

బిహార్ ప్రభుత్వ పరిశ్రమల శాఖ, ఉపేంద్ర మహారథి శిల్ప్ అనుసంధాన్ సంస్థాన్ ఆధ్వర్యంలో మాదాపూర్​ శిల్పారామంలో శుక్రవారం ‘బిహార్ క్రాఫ్ట్ ఫెయిర్’ ప్రారంభమైంది. బిహార్ పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ, సంస్థాన్ డైరెక్టర్ అలోక్ కుమార్ పాల్గొని మేళాను ప్రారంభించారు. 25వ తేదీ వరకు జరగనున్న మేళాలో మొత్తం 80 స్టాల్స్ పెట్టారు. సిక్కి ఆర్ట్​, మంజుషా ఆర్ట్​, సుజ్ని ఆర్ట్​, మధుబని పెయింటింగ్​, టికులీ ఆర్ట్​ వంటి  5 కళలను ప్రత్యక్షంగా చూపెట్టనున్నట్లు చెప్పారు. బిహార్ వంటకాలు, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయన్నారు. అనంతరం ఆంఫీ థియేటర్​లో మైత్రిరావు శివాంశ స్కూల్ ఆర్ట్స్ టీమ్ ప్రదర్శించిన భరత నాట్యం ఆకట్టుకుంది. శిల్పారామం జీఎంలు అంజయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.