E-Voting Bihar: బీహార్ మున్సిపల్ ఎన్నికలు.. ఇంట్లో కూర్చొని.. మొబైల్ యాప్తో ఓటేసే అవకాశం

E-Voting Bihar: బీహార్ మున్సిపల్ ఎన్నికలు.. ఇంట్లో కూర్చొని.. మొబైల్ యాప్తో ఓటేసే అవకాశం

దేశంలోనే తొలిసారి బీహార్లో ఓటర్లు తమ ఓటు హక్కును మొబైల్ ఫోన్లో యాప్ ద్వారా వినియోగించుకోనున్నారు. అయితే.. అందరూ కాదు పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోలేని స్థితిలో ఉన్నవారికి మాత్రమే ఈ వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది. ఈ పైలట్ ప్రాజెక్టును తొలుత బీహార్లోని పాట్నా, రోహ్‌తాస్, ఈస్ట్ చంపారన్ జిల్లాల్లో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రారంభించనున్నారు.

ఆరు మున్సిపల్ కౌన్సిల్స్ ఎన్నికలకు సంబంధించిన ఈ-ఓటింగ్ జూన్ 28, 2025.. అంటే నేటి నుంచే ప్రారంభమైంది. ఈ విధానంలో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ముఖ నిర్ధారణ తప్పనిసరి. దివ్యాంగులు, గర్భిణి స్త్రీలు ఈ విధానంలో మొబైల్ యాప్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు ఉంది. -SECBHR మొబైల్ యాప్ లేదా బీహార్ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

దొంగ ఓట్లు పోలవకుండా, ఓటు దుర్వినియోగం కాకుండా ఉండటానికి ఫేస్ మ్యాచింగ్, స్కానింగ్ తప్పనిసరి చేశారు. ఒక మొబైల్ నంబర్తో ఇద్దరు రిజిస్టర్డ్ ఓటర్లు మాత్రమే లాగిన్ అవగలరు. ప్రతీ ఒక్క ఓటును వినియోగించుకునే ముందు.. ఓటర్ ఐడీ, ఆ ఓటర్ ఐడీ వ్యాలిడిటీని అధికారులు నిర్ధారించుకుంటారు. ఈ విధానంలో ట్యాంపరింగ్ అవకాశమే లేదని నిపుణులు చెబుతున్నారు. బీహార్లో మున్సిపల్ ఎన్నికల్లో మాత్రమే ప్రస్తుతం మొబైల్ యాప్ ద్వారా ఓటు హక్కు వినియోగించునే అవకాశం ఉన్నప్పటికీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.