కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ ప్రభుత్వమే : సంగీతారెడ్డి

కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ ప్రభుత్వమే : సంగీతారెడ్డి

మియాపూర్/గండిపేట, వెలుగు: కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి సతీమణి సంగీతారెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆమె శేరిలింగంపల్లిలో పర్యటించారు. మియాపూర్​డివిజన్​లో కొత్తగా ఏర్పాటు చేసిన బీజేపీ ఆఫీసును ప్రారంభించారు. అనంతరం ప్రభాసి ఒడియా శ్రామిక సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. మోదీ నేతృత్వంలో మరో సారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

 చేవెళ్లలో  కొండా విశ్వేశ్వర్​రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే మణికొండలోని జైన్​కార్టూన్లు క్రీక్​అపార్ట్​మెంట్​లో భర్తకు మద్దతుగా సంగీతారెడ్డి ప్రచారం చేశారు. ఈసారి బీజేపీ 400కు పైగా ఎంపీ సీట్లు గెలుస్తుందని, తెలంగాణలో అత్యధిక సీట్లు గెలుచుకునేది బీజేపీనేనని చెప్పారు. గడిచిన పదేండ్లలో భారత్​ను ప్రధాని మోదీ ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. ఆమె వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.