హుజురాబాద్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం

హుజురాబాద్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం

హుజూరాబాద్ బైపోల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్.  ఒకవేళ టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు ఈటల. తాను హుజూరాబాద్ లో అభివృద్ధి చేయలేదని హరీష్ రావు అనడం సిగ్గు చేటన్నారు. మీ మామ ఆదేశాలతో నా గొంతు పిసకాలని నా దగ్గరికి వచ్చావు.. ఏదో ఒక రోజు హరీశ్ గొంతు కూడా పిసకడం ఖాయమన్నారు ఈటల.

ఓ సర్వేలో దేశంలోనే అతిపెద్ద అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని తేలిందన్నారు మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. ఏడేళ్లలో కేసీఆర్ ఆయన కుటుంబం రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుందని ఆరోపించారు. కమలాపూర్  ఉమామహేశ్వరి గార్డెన్స్ లో ఈటెల అధ్వర్యంలో... ఉప్పల్, దేశరాజపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు, కాకతీయ యూనివర్సిటీ కి చెందిన PHD విద్యార్థులు బీజేపీలో చేరారు.