- బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి
వికారాబాద్, వెలుగు : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలను కొనసాగిస్తున్నదని చేవెళ్ల మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా వ్యవహరించలేదన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తున్నదని చెప్పారు.
మోదీ ప్రధాని అయ్యాక దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైం దన్నారు. ప్రపంచ దేశాల్లో ఇండియా ఐదో స్థానానికి చేరుకుందని, త్వరలో మూడో స్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా టైంలో ఎన్నో కాంగ్రెస్ హయాంలో దివాలా తీసిన బ్యాంకులు ప్రస్తుతం లాభాల బాటలో ఉన్నాయని తెలిపారు.
ధనవంతులకు బ్యాంకు లోన్లు ఇస్తే 70 శాతం మాత్రమే తిరిగి చెల్లిస్తున్నారని, అదే పేదలకు రుణాలిస్తే 99 శాతం చెల్లిస్తున్నారని చెప్పారు. దీంతో పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు.