కామారెడ్డి బరిలో రాములమ్మ!.. కేసీఆర్‌‌పై పోటీకి సిద్ధం

కామారెడ్డి బరిలో రాములమ్మ!.. కేసీఆర్‌‌పై పోటీకి సిద్ధం

హైదరాబాద్, వెలుగు:  కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు బీజేపీ నేత విజయశాంతి సై అంటున్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేయనున్న రెండు నియోజకవర్గాల్లో కామారెడ్డి కూడా ఉండటంతో అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. బీజేపీ నుంచి బరిలోకి దిగి తన సత్తా చాటాలని ఆమె ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మెదక్ ఎంపీగా పని చేసిన విజయశాంతి.. ఈ సారి కూడా లోక్‌‌‌‌సభకు పోటీ చేయాలని భావించారు.

కానీ కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా కామారెడ్డి నుంచి పోటీ చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు ఆమె అనుచరులు చెప్తున్నారు. కామారెడ్డి నుంచి బరిలో నిలవాలని రాములమ్మ నిర్ణయించుకుంటే.. బీజేపీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై రాములమ్మ పోటీ చేస్తే.. రాష్ట్ర రాజకీయాల్లో కామారెడ్డి సీటు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవనుంది.