ఈ రోజు ఆట..రేపు వేట

ఈ రోజు ఆట..రేపు వేట


హుజురాబాద్ లో ఇవాళ ఆట మొదలైందని..రేపు వేటగా మారుతుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. వచ్చే ఎన్నికల్లో ఐదుగురు ఎమ్మెల్యేలను గెలిచి..అసెంబ్లీలో బిజెపి ఎల్ పి కార్యాలయం సాధిస్తామన్నారు. నిన్నటి వరకు నీతి, నిజాయితీతో ఉన్న హుజురాబాద్, రేపటి నుంచి మందుసీసాలకు బిర్యానులకు పట్టం కట్టాలని కోరినట్లు ఉందన్నారు మంత్రి గంగుల తీరు. ఏడేళ్ళు ఏం చేయకపోతే మీరు సన్నాసులా కాదా అని ప్రశ్నించారు. ప్రకృతి వనం,  వైకుంఠధామంలకు కేంద్రం డబ్బులిచ్చిందన్నారు.  కేంద్రం ఇచ్చిన డబ్బులతోనే గులాబీ రంగు వేస్తున్నారన్నారు.