కేసీఆర్ ను నాశనం చేసిందే కేటీఆర్,కవిత: అర్వింద్

కేసీఆర్ ను నాశనం చేసిందే కేటీఆర్,కవిత: అర్వింద్

ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ వి చిల్లర కామెంట్స్ అని విమర్శించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. కేసీఆర్ ను నాశనం చేసిందే కేటీఆర్, కవిత అంటూ తీవ్ర విమర్శలు చేశారు. నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్, కవిత  రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. 

కవిత రేపో మాపో జైలుకు  పోతదన్నారు అర్వింద్. కేటీఆర్ భాగోతలన్నీ తనకు తెలుసని.. కవిత కంటే ముందే కేటీఆర్ జైలుకు పోయినా ఆశ్చర్యం లేదన్నారు. తోలువలిశి డోలు కడ్తా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి మోడీ ఎన్నో ప్రాజెక్టులు తెస్తున్నాడని..   మీరిచ్చే ట్యాక్స్ కంటే  కేంద్రం నుంచి నాలుగు రెట్లు ఎక్కువ వస్తుందన్నారు.  నారీశక్తి, భారత శక్తితో కవితకు ఏం సంబంధం అని ప్రశ్నించారు అర్వింద్.  

పసుపు బోర్టు తెచ్చి తన నాన్న  పేరును నిలబెట్టానని అర్వింద్ అన్నారు. అయితే డ్రగ్స్ దందాతో కేటీఆర్, లిక్కర్ దందాతో కవిత కూడా వాళ్ల నాన్న పేరు నిలబెట్టారని సెటైర్లు వేశారు. దోచుకోవడానికే కవిత, కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని మండిపడ్డారు. కవిత, కేటీఆర్ను చూసి ప్రజలు, రైతులు తలదించుకుంటున్నారని ధ్వజమెత్తారు.