లోక్​సభలో మహిళా బిల్లు.. బీజేపీ నేతల సంబురాలు

లోక్​సభలో మహిళా బిల్లు.. బీజేపీ నేతల సంబురాలు
  •   మోదీ ఫొటోకు పాలాభిషేకం చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్

గచ్చిబౌలి, వెలుగు : మహిళలకు చట్టసభల్లో 33 శాతం  రిజర్వేషన్లు కల్పించే బిల్లును మంగళవారం లోక్ సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవి కుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. కొండాపూర్ పరిధి మజీద్ బండలో మోదీ ఫొటోకు ఆయన పాలాభిషేకం చేశారు.

కార్యక్రమంలో శేరిలింగంపల్లి సెగ్మెంట్ కన్వీనర్ రాఘవేంద్రరావు, మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి, కంటెస్టెడ్ కార్పొరేటర్ సింధు రెడ్డి, రాధాకృష్ణ యాదవ్, మహిళా మోర్చా అసెంబ్లీ కన్వీనర్ పద్మ, రాష్ట్ర నాయకులు, జిల్లా, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.