
హుస్నాబాద్: ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్కు దళితులు, బీసీలు, ఎస్టీలు గుర్తుకొస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నేరవేర్చారో లేదో సమీక్ష చేసుకోవాలని కేసీఆర్కు బండి సూచించారు. కరోనా సమయంలో వందలాది మంది చనిపోయినా.. ఏ ఒక్క రోజు కరోనా జాగ్రత్తలపై మాట్లాడలేదని సీఎంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్కు కరోనా సోకేంత వరకు అదో వ్యాధి అని, దాని తీవ్రత ఎంతుంటుందో ఆయనకు తెలియకపోవడం విడ్డూరమన్నారు. కొవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఏం చేసినా కమీషన్ల కోసమేనని ఆరోపించారు.