అహ్మదాబాద్ విమాన ప్రమాదం: బ్లాక్ బాక్స్ ఇండియాలోనే ఉంది.. ఎక్కడికీ పంపలేదు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం: బ్లాక్ బాక్స్ ఇండియాలోనే ఉంది.. ఎక్కడికీ పంపలేదు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం సృష్టించిన విధ్వంసాన్ని దేశం ఇప్పట్లో మరిచిపోలేదు. ఈ ప్రమాదం కారణంగా జనం ఎయిర్ ఇండియా విమానం ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి. దీనికి తోడు అహ్మదాబాద్ ఘటన తర్వాత ఎయిర్ ఇండియా విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో జనంలో భయం పంచుతోంది. ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో కూలిన ఎయిర్ ఇండియా 171 విమానం బ్లాక్ బాక్స్ విచారణపై కీలక అంశాన్ని వెల్లడించారు విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. బ్లాక్ బాక్స్ ను ఎక్కడికి పంపలేదని.. ఇండియాలోని విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు.

పూణేలో జరిగిన 7వ హెలికాప్టర్లు, చిన్న విమానాల సమ్మిట్ 2025లో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.బ్లాక్ బాక్స్ ఇండియాలోనే ఉందని..  AAIB ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని అన్నారు రామ్మోహన్ నాయుడు. బ్లాక్ బాక్స్ విదేశాలకు పంపడం అనేది కేవలం ఉహాగానమే అని స్పష్టం చేశారు రామ్మోహన్ నాయుడు.

ALSO READ | భారత్ నాగాస్త్రా 1R డ్రోన్ బాంబ్ ప్రత్యేకత తెలిస్తే ఔరా అంటారు.. పిన్ పాయింట్ లో లేపేస్తుంది..!

ఈ ప్రమాదంపై దర్యాప్తు కోసం AAIB ఆధ్వర్యంలో ఒక ప్యానెల్ ను ఏర్పాటు చేయనున్నామని.. వారం రోజుల్లో ప్యానెల్ ను ప్రకటిస్తామని అన్నారు రామ్మోహన్ నాయుడు. “దర్యాప్తు మొదటి రోజు నుండే ప్రారంభమైందని... AAIB నియమాలు, విధానాల ప్రకారం దర్యాప్తు చేస్తోందని అన్నారు. ఈ దర్యాప్తుపై AAIB పూర్తి బాధ్యత వహిస్తుందని.. బ్లాక్ బాక్స్ పై విచారణ కూడా AAIB ఆధ్వర్యంలోనే జరుగుతోందని స్పష్టం చేశారు రామ్మోహన్ నాయుడు.