భారత్ నాగాస్త్రా 1R డ్రోన్ బాంబ్ ప్రత్యేకత తెలిస్తే ఔరా అంటారు.. పిన్ పాయింట్ లో లేపేస్తుంది..!

భారత్ నాగాస్త్రా 1R డ్రోన్ బాంబ్ ప్రత్యేకత తెలిస్తే ఔరా అంటారు.. పిన్ పాయింట్ లో లేపేస్తుంది..!

భారత సాయుధ దళాల చేతికి మరో అస్త్రం.. శత్రు స్థావరాలు, శత్రు వాహనాలపై నిఘా, ఖచ్చితమైన దాడి చేసి సమర్థవంతంగా ధ్వంసం చేయగల గేమ్ ఛేంజర్ డ్రోన్..నాగస్త్ర-1R తో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.నాగస్త్ర-1R కోసం భారత సైన్యం  ఆర్డర్ ఇచ్చింది. 

సోమవారం (జూన్ 23) నాగస్త్ర-1R కోసం భారత సైన్యం 1981 కోట్లతో అధికారికంగా ఆర్డర్ ఇచ్చింది. ఇది భారతదేశ డ్రోన్ ఆధారిత యుద్ధ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుంది. జెన్ టెక్నాలజీస్ , డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ డ్రోన్ ఆధునిక యుద్ధంలో గేమ్-ఛేంజర్‌గా మారనుంది.

నాగస్త్ర-1R ప్రత్యేకతలు 

నాగస్త్ర-1R నిఘా, లక్ష్యాలపై ఖచ్చితమైన దాడి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది శత్రువుల స్థావరాలు లేదా వాహనాలను సమర్థవంతంగా ధ్వంసం చేయగలదు. 15 కిలోమీటర్ల వరకు సుదూర ప్రయాణం చేయగలదు. సరిహద్దు వెంబడి లేదా శత్రు భూభాగంలో లోతుగా ఉన్న లక్ష్యాలను కూడా చేరుకోగలదు.

ఈ డ్రోన్ గాలిలో ఎక్కువ సమయం ఉండగలదు. లక్ష్యాన్ని గుర్తించడానికి ,సరైన సమయం కోసం వేచి ఉండటానికి వీలు కల్పిస్తుంది. దీని తేలికైన నిర్మాణం సులువుగా మోసుకెళ్లడానికి ,వేగంగా మోహరించడానికి సైనికులకు సహాయపడుతుంది.

ALSO READ | Gautam Adani: ఆపరేషన్ సిందూర్‌లో అదానీ గ్రూప్ కీలక పాత్ర.. గాల్లోనే శత్రువుపై విధ్వంసం..

నాగస్త్ర-1R  కేవలం దాడికే కాకుండా, శత్రువుల కదలికలపై నిఘా పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. నాగస్త్ర-1R భారత రక్షణ రంగానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది.  ఇది మెరుగైన ఆపరేషనల్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఆర్మీ ఆధునిక యుద్ధ వ్యూహాలను అమలు చేయడానికి అనుమతిస్తుంది. మానవ ప్రమేయం లేకుండా శత్రువుల కీలక లక్ష్యాలను నాశనం చేయగలదు. 

సైనికుల భద్రతలో నాగస్త్ర-1R  కీలకంగా మారనుంది. సూసైడ్ డ్రోన్‌గా పిలువబడే ఇది ప్రమాదకరమైన మిషన్లలో సైనికుల ప్రాణ నష్టాన్ని తగ్గిస్తుంది.ప్రస్తుత ఆయుధాలతో పోలిస్తే లోటరింగ్ మందుగుండు సామగ్రి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇది రక్షణ బడ్జెట్‌పై భారాన్ని తగ్గిస్తుంది.

మొత్తంగా నాగస్త్ర-1R భారత సైన్యానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధం. ఇది రక్షణ ఆవిష్కరణ, స్వావలంబనకు చిహ్నంగా భవిష్యత్తులో దేశ భద్రతను పటిష్టతకు కీలకంగా మారనుంది.