కొత్త ఫోన్, బైక్ ​కొనివ్వలేదని సూసైడ్

కొత్త ఫోన్, బైక్ ​కొనివ్వలేదని సూసైడ్

ఇల్లెందు, వెలుగు:  కొత్త ఫోన్​ కొనివ్వలేదని ఇల్లెందులోని నెంబర్​2 బస్తీకి చెందిన పంజాల సాయి(18) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పబ్​జీ ఆడేందుకు కొత్త ఫోన్​తో పాటు బైక్​కొనివ్వాలని తల్లిదండ్రులతో కొద్దిరోజులుగా గొడవ పడుతున్నాడు. సోమవారం ఇదే విషయమై సాయి తల్లిదండ్రులతో కొట్లాడగా..  కొనిస్తామని సర్దిచెప్పారు.  వారి మాటలతో సంతృప్తి చెందని సాయి బుధవారం ఉదయం ఇంటిపైన కొత్తగా కడ్తున్న గదిలో ఉరివేసుకున్నారు. ఇది గమనించిన తల్లిదండ్రులు దవాఖానాకు తరలించగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో ఒక్కరోజే 107 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు మృతి

బతికుండగానే.. తల్లికి నిప్పంటించాడు