బోయగూడ అగ్నిప్రమాదం.. ఇద్దరికి ఈ మధ్యే వివాహం

బోయగూడ అగ్నిప్రమాదం.. ఇద్దరికి ఈ మధ్యే వివాహం

సికింద్రాబాద్: బోయగూడ అగ్నిప్రమాద మృతుల డెడ్ బాడీలకు గాంధీఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం పూర్తి చేస్తున్నారు. మృతదేహాలు పాడవకుండా ఎంబామింగ్ నిర్వహిస్తున్నారు డాక్టర్లు. 11 మంది డెడ్ బాడీలకు DNA టెస్టులు చేస్తున్నారు. మరోవైపు ప్రమాదంలో గాయపడిన ప్రేమ్ ను గాంధీ మార్చురీకి తీసుకెళ్లిన అధికారులు..వారిని గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. ప్రత్యేక విమానం ద్వారా ఇవాళ ఆరు, రేపు మరో ఐదు మృతదేహాలను బెంగళూరుకు తరలించి.. కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా అక్కడి నుంచి పాట్నాకు తీసుకెళ్లనున్నారు. పాట్నా నుంచి వారి స్వస్థలాలకు తీసుకెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.  అగ్నిప్రమాదంలో చనిపోయిన బిహార్ కార్మికుల్లో ఇద్దరికి ఈ మధ్యే వివాహం జరిగింది. వారికి చిన్న పిల్లలు ఉన్నట్లు బంధువులు తెలిపారు.