బీఆర్ఎస్, బీజేపీలు ఉనికి కోల్పోతున్నాయి : శ్రీధర్ బాబు

బీఆర్ఎస్, బీజేపీలు ఉనికి కోల్పోతున్నాయి : శ్రీధర్ బాబు

బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు గుప్పించారు. బీజేపీ, బీఆర్ఎస్ లు ఉనికి కోల్పోతున్నాయని విమర్శించారు. ఆ పార్టీ నేతల్లో భయం మొదలైందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాలు గెలుస్తామని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తమకేం కాదని అన్నారు. ప్రజలు తమని ఆశీర్వదించారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల నుంచే విమర్శలు చేస్తున్నారని అన్నారు. 

పదేళ్లలో బీఆర్ఎస్ బీజేపీలు నేతలు ఏం చేశారో చెప్పండని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. జిల్లాల్లో ఐటీ టవర్లు కట్టి వదిలేశారని విమర్శించారు.  ఐటీ టవర్లలో ఉద్యోగాల కల్పనకు దిగ్గజ కంపెనీలతో మాట్లాడుతున్నామని అన్నారు. పెట్టుబడులపై బీఆర్ఎస్ చెప్పుకునేది ఎక్కవ చేసింది తక్కువ అని శ్రీధర్ బాబు ఆరోపించారు.