కంటోన్మెంట్ అభ్యర్థిగా లాస్య నందిత అక్కను ప్రకటించిన బీఆర్ఎస్

కంటోన్మెంట్ అభ్యర్థిగా లాస్య నందిత అక్కను ప్రకటించిన బీఆర్ఎస్

కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత అక్క నివేదితను ఎన్నికల బరిలో దింపింది. ఈ మేరకు పార్టీ హైకమాండ్ ప్రకటించింది. 2023లో జరిగిన సాధరణ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్య నందిత పోటీ చేసి గెలుపొందారు. ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. దీంతో కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కి బై ఎలక్షన్ అనివార్యం అయ్యింది. 

ఈ ఎన్నికల్లో లాస్య నందిత అక్కను నిలబెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. కాగా, అటు కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్  పోటీ చేయనున్నారు. బై ఎలక్షన్ కు సంబందించి కమలం పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.