ఢిల్లీ ఆజాద్ మార్కెట్ ప్రాంతంలో కుప్పకూలిన బిల్డింగ్

ఢిల్లీ ఆజాద్ మార్కెట్ ప్రాంతంలో కుప్పకూలిన బిల్డింగ్

ఢిల్లీలో దారుణ సంఘటన జరిగింది. ఆజాద్ మార్కెట్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో  ముగ్గురు మరణించినట్లుగా తెలుస్తోంది. ఐదుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో ఏడుగురికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ అధికారులు..సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద కూలీలు చిక్కుకోవడంతో వాటిని తొలగిస్తున్నారు. 

శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి రవీందర్ సింగ్ తెలిపారు. దాదాపు 6 నుంచి 7 మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారని తెలిపారు. గాయపడిన 5 మందిని ఆస్పత్రికి తరలించామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా చేరుకుందని...లైవ్ డిటెక్టర్ ద్వారా కూడా కూలీలను గుర్తిస్తున్నామని తెలిపారు. అయితే  ఇరుకుగా ఉండటంతో.. జేసీబీ లోపలికి చేరుకోలేకపోతుందన్నారు.