ఎయిర్ టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. రూ.49 రీచార్జ్ ప్యాక్ ఫ్రీ

ఎయిర్ టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. రూ.49 రీచార్జ్ ప్యాక్ ఫ్రీ
  • రూ.49 రీచార్జ్ ప్యాక్ తో రూ.38 టాక్ టైం..  28 రోజుల వ్యాలిడిటీతో 100 ఎంబీ డేటా

కరోనా కష్ట కాలంలో తన కస్టమర్లకు ఊరట కలిగించేలా ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.49 ప్యాక్ ను ఒకసారి రీచార్జ్ చేసుకుంటే పూర్తిగా ఉచితం అని, ఎలాంటి షరతులు లేవని ఎయిర్ టెల్ ప్రకటించింది. ఎలాంటి వ్యాపార ఎత్తుగడలు లేకుండా పూర్తిగా సేవా భావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ టెల్ స్పష్టం చేసింది. 34 కోట్ల మంది కస్టమర్లు ఉన్న ఎయిర్ టెల్  కరోనా కాలంలో అల్పాదాయ వర్గాలను తనవంతుగా ఆదుకునేందుకే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. 
5.5కోట్ల మంది కస్టమర్లకు లబ్ది
ఎయిర్ టెల్ ప్రకటించిన ఈ ఆఫర్ తో 5.5 కోట్ల మంది కస్టమర్లు లబ్ది పొందనున్నారు. కరోనా కల్లోల సమయంలో మా కస్టమర్లకు కనీసం 49 రూపాయల రీచార్జ్ ను ఒకసారి ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని.. దీని విలువ రూ.270 కోట్లని ఎయిర్ టెల్ తెలిపింది. ఉచితంగా ఇవ్వనున్న రూ.49 ప్యాక్ తో 38 రూపాయల టాక్ టైం.. 100 ఎంబీ డేటాను 28 రోజుల వ్యాలిడిటీతో వాడుకోవచ్చని తెలిపింది. అలాగే  రూ.79 ప్యాక్ తో రెట్టింపు ప్రయోజనాలు అందుతాయని ఎయిర్ టెల్ ప్రకటించింది. ఈ రెండు ప్రయోజనాలు మర వారం రోజుల్లో ప్రీపెయిడ్ వినియోగదారులకు అందుతాయని ఎయిర్ టెల్ ప్రకటించింది.