హైదరాబాద్ లో దైవ దర్శనానికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో చోరీ

హైదరాబాద్ లో దైవ దర్శనానికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో చోరీ

జవహర్ నగర్ వెలుగు : దైవ దర్శనానికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో నగదు చోరీ అయింది.  జవహర్ నగర్ పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా నర్వ మండలం పాతసేరికి చెందిన అనగాని వెంకటేశ్ సిటీకి వచ్చి జవహర్ నగర్ లో ఉంటున్నాడు. కుటుంబంతో కలిసి సోమవారం మన్నెంకొండ దేవస్థానానికి వెళ్లారు.

బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ఇంటికి రాగా.. తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని రూ.40 వేల నగదు కనిపించలేదు. దీంతో బాధితులు పోలీసులకు కంప్లయింట్ చేయగా  కేసు నమోదు చేసినట్టు జవహర్ నగర్ సీఐ తెలిపారు.