వనపర్తి జిల్లాలో RTC బస్సు బోల్తా : ఒకరి పరిస్థితి విషమం

వనపర్తి జిల్లాలో RTC బస్సు బోల్తా : ఒకరి పరిస్థితి విషమం

వనపర్తి జిల్లా కొత్తకోట దగ్గర ఆర్టీసీ బస్సు  ప్రమాదం జరిగింది. కనిమెట్ట సమీపంలో NH 44  పై కడప నుంచి హైద్రాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి ప్రస్తుతం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది.  గాయపడిన మరో ముగ్గురిని హాస్పిటల్ కు తరలించారు. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణీకులున్నారు.