హిమాచల్ ప్రదేశ్ లో లోయలో పడ్డ స్కూల్ బస్సు

హిమాచల్ ప్రదేశ్ లో  లోయలో పడ్డ  స్కూల్ బస్సు

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కులు జిల్లాలోని నియోలి- షంషేర్ రోడ్డులోని లోయలో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిని స్టూడెంట్లను హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదంలో మరణాల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు కులు డీసీ అశుతోష్ గార్గ్. ఉదయం 8 గంటల ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగిందన్నారు. స్పాట్ లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నామన్నారు కులు డీసీ. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నట్లు తెలిపారు. ప్రమాద సమయలో బస్సులో 45 మంది ఉన్నట్లు సమాచారం.