కేంద్ర పథకాలపై గ్రామాల్లో ప్రచారం : బండి సంజయ్

కేంద్ర పథకాలపై గ్రామాల్లో ప్రచారం : బండి సంజయ్
కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులు ప్రచారం చేయాలని కోరారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కరీంనగర్‌ కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్‌ సమావేశంలో పాల్గొని మాట్లాడారు బండి సంజయ్. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులే కీలకమన్నారు. కరోనా సమయంలో జిల్లా అధికారులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలిపారు. దేశంలోనే మొదటి సారిగా కరీంనగర్‌ జిల్లాలో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అయ్యాయని…ఆ టైంలో అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండి కేసులను కంట్రోల్‌ చేసినందుకు తీవ్రంగా కృషి చేశారన్నారు బండి సంజయ్.