మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ కుమార్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ల్యాండ్కబ్జాకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. నకిలీ డాక్యుమెంట్స్, ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్ల సృష్టించి ల్యాండ్ కబ్జాకు యత్నించినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈమేరకు నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో ఎన్ ఈసీఎల్కంపెనీకి చెందిన భూమి ఉంది. అయితే అందులో అక్రమంగా చొరబడి రూముల నిర్మాణం చేపట్టారని.. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి సర్వే నంబర్ 129/54లో 1350 చదరపు గజాల స్థలాన్ని కబ్జాకు యత్నించారని చింతా మాధవ్ తన ఫిర్యాదులో తెలిపాడు.
దీంతో సంతోష్ రావుతో పాటు లింగారెడ్డి శ్రీధర్ పై బంజరాహిల్స్ పీఎస్ లో కేసు నమోదైంది. కాగా సంతోష్ రావు 420,468,471,447,120, ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ కింద పోలీసులు కేసు నమోదైంది.