
ప్రపంచ వ్యాప్తంగా 1600 కోట్ల అకౌంట్లకు సంబంధించిన డేటా లీక్ అయినట్లు సంచలన రిపోర్ట్స్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీమ్ ప్రజలకు కీలక అడ్వైజరీని జారీ చేసింది. ప్రజలు తమ ఖాతాలు సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలకు అనుగుణంగా మార్చుకోవటం వల్ల నేరగాళ్ల బారిన పడకుండా ఉంటారని పేర్కొంది.
డేటా బ్రీచ్ కారణంగా యూజర్ నేమ్స్, పాస్ వర్డ్స్, అథెంటికేషన్ టోకెన్స్, మెటా డేటా లీకైనట్లు నివేదించబడింది. అయితే ఈ సమాచారం గూగుల్, మెటా, ఆపిల్, ఫేస్ బుక్, టెలిగ్రామ్, గిట్ హబ్ అలాగే అనేక వీపీఎన్ సేవలకు సంబంధించిన లీక్ అయినట్లు వెల్లడైంది. అందువల్ల ప్రజలు తమ డిజిటల్ ఖాతాల పాస్ వర్డ్స్ మార్చేయాలని సీఈఆర్టీ పేర్కొంది. అలాగే వీలైనంత వరకు మల్టీ ఫ్యాక్టర్ వెరిఫికేషన్ అథెంటికేషన్ ఫీచర్లకు మారాలని చెప్పింది. అలాగే వ్యక్తులు తమ డిజిటల్ అసెట్స్ లో యాంటి వైరస్ స్మాన్స్ చేపట్టడంతో పాటు తాజా వర్షన్లను సిస్టమ్స్ అప్ గ్రేడ్ చేసుకోవటం మంచిదని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సూచిస్తోంది.
CERT-In has published an Advisory on its website
— CERT-In (@IndianCERT) June 24, 2025
(23-06-2025)
Broad Credential Exposure Involving Multiple Online Serviceshttps://t.co/AKq2Mbk23E
డార్క్ వెబ్లో అందుబాటులో ఉందని భావిస్తున్న ఈ భారీ డేటాసెట్.. 30 వేర్వేరు వనరుల నుంచి సంకలనం చేయబడిందని, ఎక్కువగా ఇన్ఫోస్టీలర్ మాల్వేర్ ద్వారా తయారు చేయబడిందని తెలుస్తోంది. ఈ డేటాసెట్ దాడి చేసేవారు ఫిషింగ్, ఖాతా టేకోవర్లు, రాన్సమ్వేర్ దాడులు, వ్యాపార ఇమెయిల్ దుర్వినియోగానికి సైబర్ నేరగాళ్లు వీటిని వినియోగిస్తారని నిపుణులు హెచ్చరిస్తారు. భద్రత కోసం ప్రజలు తమ పాస్వర్డ్ లను వెంటనే మార్చుకోవాలని సూచించబడింది.
Cybersecurity best practices. #indiancert #cyberswachhtakendra #StaySafeOnline #cybersecurity #besafe #staysafe #mygov #Meity #onlinefraud #cybercrime #scamming #cyberalert #CSK #CyberSecurityAwareness pic.twitter.com/JRBLHaRH2Y
— CERT-In (@IndianCERT) June 24, 2025