మకాం మార్చే ఆలోచనలో బాబు

మకాం మార్చే ఆలోచనలో బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లి నుంచి తన మకాం మార్చే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఉండవల్లిలో ఉంటున్న తన ఇల్లును ఖాళీ చేయడమే మంచిదని టీడీపీ సీనియర్ నేతలు సూచించడంతో బాబు కొత్త ఇంటి కోసం అన్వేషణ ప్రారంభించారు. నోవాటెల్ హోటల్ ప్రాంతంలో భారతీ నగర్ 7వ క్రాస్ లో క్వాలిటీ ఐస్ క్రీం గెస్ట్ హౌస్ లేదా కామినేని ఆస్పత్రి ఎదురుగా గ్రావెల్ ఇండియా గెస్ట్ హౌస్ ను నివాసముండేందుకు పరిశీలిస్తున్నారు.

మరో వైపు ఏపీ ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో బాబు స్వగ్రామమైన నారావారి పల్లిలోని ఆయన నివాసం వద్ద భద్రతను తగ్గించింది. బాబు నివాసం దగ్గర ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లతో మాత్రమే భద్రతా చర్యలు చేపట్టింది. ఇదంతా వైసీపీ కక్ష పూరిత చర్యలే అని టీడీపీ నేతలు అంటున్నారు.