Tarakaratna: తారకరత్నకు చంద్రబాబు నివాళి

Tarakaratna: తారకరత్నకు చంద్రబాబు నివాళి

నందమూరి తారకరత్నకు  సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మోకిలలోని  తారకరత్న నివాసానికి వచ్చిన చంద్రబాబు దంపతులు ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించారు. కటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని  చంద్రబాబు పలకరించారు. తారకరత్న ట్రీట్ మెంట్ గురించి విజయసాయిరెడ్డి చంద్రబాబుకు వివరించారు.  ఇద్దరు పక్కపక్కనే కూర్చుని కాసేపు మాట్లాడుకున్నారు. తారకరత్న ఆస్పత్రిలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి వెళ్లి పరామర్శించారు. తారకరత్నను దగ్గరుండి చూసుకున్న బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పారు. తారకరత్న భార్య అలేఖ్య, విజయసాయిరెడ్డి భార్య చెల్లెలి కూతురు.