జూబ్లీహిల్స్, వెలుగు: క్యాష్ డెబిట్ మెషీన్లో మనీ డిపాజిట్ చేసేందుకు వెళ్లిన వ్యక్తిని.. గుర్తుతెలియని యువకుడు మోసం చేశాడు. క్యాష్ఇస్తే ఫోన్పే చేస్తానంటూ నమ్మించి రూ.20వేలు కొట్టేశాడు. దాసరి సురేశ్ గురువారం హైదరాబాద్లోని మధురానగర్ మెట్రోస్టేషన్ ఎదురుగా ఉన్న క్యాష్ డెబిట్ మెషీన్వద్దకు వెళ్లాడు. అదే టైంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి సురేశ్ దగ్గరకు వచ్చాడు.
క్యాష్ ఇస్తే ఫోన్పే ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తానని నమ్మించాడు. సురేశ్ తన ఓనర్ ఫోన్ నంబర్ఇచ్చాడు. సదరు యువకుడు ట్రాన్స్ ఫర్చేసినట్లు సురేశ్కు చూపించి, రూ.20 వేలు తీసుకువెళ్లిపోయాడు. తర్వాత సురేశ్ తన ఓనర్కు కాల్చేయగా మనీ రాలేదని చెప్పాడు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.