క్యాష్ ఇస్తే ఫోన్​పే చేస్తానంటూ చీటింగ్​

క్యాష్ ఇస్తే ఫోన్​పే చేస్తానంటూ చీటింగ్​

 జూబ్లీహిల్స్, వెలుగు: క్యాష్​ డెబిట్​ మెషీన్​లో మనీ డిపాజిట్​ చేసేందుకు వెళ్లిన వ్యక్తిని.. గుర్తుతెలియని యువకుడు మోసం చేశాడు. క్యాష్​ఇస్తే ఫోన్​పే చేస్తానంటూ నమ్మించి రూ.20వేలు కొట్టేశాడు. దాసరి సురేశ్ గురువారం హైదరాబాద్​లోని మధురానగర్ మెట్రోస్టేషన్ ఎదురుగా ఉన్న క్యాష్​ డెబిట్ ​మెషీన్​వద్దకు వెళ్లాడు. అదే టైంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి సురేశ్ దగ్గరకు వచ్చాడు. 

క్యాష్​ ఇస్తే ఫోన్​పే ద్వారా మనీ ట్రాన్స్​ఫర్ ​చేస్తానని నమ్మించాడు. సురేశ్ ​తన ఓనర్ ఫోన్ ​నంబర్​ఇచ్చాడు. సదరు యువకుడు ట్రాన్స్ ఫర్​చేసినట్లు సురేశ్​కు చూపించి, రూ.20 వేలు తీసుకువెళ్లిపోయాడు. తర్వాత సురేశ్ ​తన ఓనర్​కు కాల్​చేయగా మనీ రాలేదని చెప్పాడు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.