సుమారు ఏడు దశాబ్దాల తర్వాత ఇండియాకు చీతాలు

సుమారు ఏడు దశాబ్దాల తర్వాత ఇండియాకు చీతాలు

సుమారు ఏడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత నమీబియా చీతాలు ఇండియాకు చేరుకున్నాయి. అంతరించిపోయిన వన్యప్రాణుల్ని పునరుద్ధరించే ప్రాజెక్టులో భాగంగా నమీబియా నుంచి ఎనిమిది చీతాలను భారత్‌కు తీసుకువచ్చారు. ఇవాళ ప్రధాని మోడీ తన పుట్టిన రోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని కునో– పాల్‌పూర్‌ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోకి ఈ చీతాలను విడుదల చేయనున్నారు. రెండు నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న మూడు మగ, అయిదు ఆడ చీతాలను ఇండియాకు తీసుకువచ్చారు. వీటిని తీసుకురావడానికి బీ747 జంబో జెట్‌కు మార్పులు చేశారు. అయితే ఈ విమానం ముఖ భాగాన్ని ఫులి ముఖంతో డిజైన్ చేసిన ఫొటోను ఇప్పటికే అక్కడి ఇండియన్ కమిషన్ విడుదల చేసింది.

కునో నేషనల్ పార్క్.. గ్వాలియర్‌కు 165 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాజ్‌పుర ఎయిర్‌ బేస్‌ను IAF పర్యవేక్షిస్తోంది. ఇక ప్రధాని మోడీ కాసేపట్లో కునో నేషనల్ పార్క్‌లో చీతా ప్రాజెక్టును ప్రారంభిస్తారు. మూడు చీతాలను క్వారంటైన్‌ ఎన్‌క్లోజర్లలోకి విడుదల చేస్తారు. ఈ ఘటనతో భారత్ లో మళ్లీ చీతా గాండ్రింపులు వినబోతున్నందుకు పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.