లెజెండరీ యాక్టర్ కోట.. ఇద్దరం ఒకే సినిమాతో కెరీర్ మొదలు పెట్టాం: చిరంజీవి

లెజెండరీ యాక్టర్ కోట.. ఇద్దరం ఒకే సినిమాతో  కెరీర్ మొదలు పెట్టాం: చిరంజీవి

కోట శ్రీనివాస రావు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాస రావు  ఇక లేరనే  వార్త ఎంతో కలచివేసిందన్నారు.  ప్రాణం ఖరీదు' చిత్రంతో ఆయన తాను  ఒకే సారి సినిమా కెరీర్ ప్రారంభించామని గుర్తు చేశారు. ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో  నటించి, ప్రతి  పాత్రని తన  విలక్షణ, ప్రత్యేక శైలితో అలరించి  తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారని అన్నారు . 

కామెడీ  విలన్, అయినా  సీరియస్ విలన్  అయినా, సపోర్టింగ్ క్యారక్టర్ అయినా, ఆయన పోషించిన  ప్రతి  పాత్ర ఆయన మాత్రమే చేయగలడు అన్నంత  గొప్పగా నటించారు.  రీసెంట్ గా ఆయన కుటుంబంలో  జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో  కుంగదీసింది.   కోట శ్రీనివాస రావు లాంటి  నటుడు లేని  లోటు చిత్ర  పరిశ్రమకి, సినీ ప్రేమికులకి  ఎన్నటికీ తీరనిది.ఆయన ఆత్మకి శాంతి  చేకూరాలని  ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ  సభ్యులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి  తన   ప్రగాఢ సంతాపం తెలిపారు చిరంజీవి.అనారోగ్యంతో జులై 13న తుది శ్వాస విడిచిన కోట మృతి పట్ల సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

40 ఏళ్ల సినీ కెరీర్ లో తెలుగు,హిందీ, కన్నడ,మలయాళంలో మొత్తం750కి పైగా సినిమాల్లో నటించారు. విలన్ గా, కమోడియన్ గా, తండ్రిగా ఇలా ఎన్నో రకాల పాత్రలకు ఆయన జీవం పోశారు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నటనకు గానూ 9 నంది అవార్డులు, ఒక సైమా అవార్డు గెలుచుకున్నారు 2015లో పద్మశ్రీ అవార్డు లభించింది.