వికారాబాద్, వెలుగు : జిల్లాలోని పూడూర్ మండలం మంచనపల్లికి చెందిన బాబయ్య, శశికళ దంపతుల కొడుకు తరుణ్ సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 231 వ ర్యాంకు సాధించిన సందర్భంగా మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు, అడ్వకేట్ ఆనంద్ తరుణ్ బుధవారం ఘనంగా సన్మానించారు.
రిజర్వేషన్లను వాడుకోకుండా జనరల్ లోనే మంచి ర్యాంకు సాధించిన తరుణ్ కు, అతడిని ప్రోత్సహించిన తల్లిదండ్రులు, బాబాయిలకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పబ్లిక్ వాయిస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి యాదయ్య, శ్రవణ్ ,రాజు, సుధాకర్, తేజ, టీచర్ శ్రీనివాస్ ఉన్నారు.