26న తిరుమల, శ్రీశైలం ఆలయాల మూసివేత

26న తిరుమల, శ్రీశైలం ఆలయాల మూసివేత

సూర్య గ్రహణం కారణంగా ఈనెల 26న తిరుమల తిరుపతి, శ్రీశైలం ఆలయాలు మూతపడనున్నాయి. 13 గంటలపాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు TTD అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 25న రాత్రి 11 గంటల నుంచి 26 మధ్యాహ్నం 12 వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. ఇందులో భాగంగా 26న తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి. గ్రహణం కారణంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉభయ దేవాలయాల ద్వారాలను మూసివేస్తునట్టు దేవస్థానం అధికారులు తెలిపారు. గ్రహణం రోజు ఉదయం 11.30 గంటల వరకు ఆలయం మూసివేయనున్నట్టు చెప్పారు.