‘ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి ఫామ్ హౌస్ లోనే ఉంటున్న‌డు’

‘ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి ఫామ్ హౌస్ లోనే ఉంటున్న‌డు’

సీఎం కేసీఆర్ ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఆయన సీహెచ్ఎన్ సీ ని తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ కరోనా వ్యాధి పట్ల తేలికగా మాట్లాడి తాను, తన ఎమ్మెల్యేలు, మంత్రులు అవసరమైతే మాస్క్ లు లేకుండా పని చేస్తామని ప్రగల్భాలు పలికారని అన్నారు. ఎమ్మెల్యేలు ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

కరోనా మహమ్మారి వల్ల రాష్ట్ర ప్రజలందరూ ఆందోళనకు గురవుతున్నారని, సీఎం మాత్రం ప్రజల్లో తిరగకుండా ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. మంత్రులందరూ కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారారని, ఎమ్మెల్యేల జాడకూడా కనిపించడం లేదని అన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉత్సవ విగ్రహంలా మారిపోయారని అన్నారు. మంత్రి కేటీఆర్ హైటెక్ అంటూ తిరుగుతున్నాడని విమర్శించారు.

రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఆసుపత్రులు ఉన్నాయని, కేసీఆర్ సీఎం అయ్యాక ఒక్క ఆసుపత్రిని నిర్మించలేదని విమర్శించారు. లక్షల కోట్లు ఖర్చు చేసి ప్రజారోగ్యాన్నీ మాత్రం విస్మరించారని తెలిపారు. లక్షల కోట్లలో 10 వేల కోట్లు ఆరోగ్య శాఖకు ఖర్చుపెట్టి ఉంటే ప్రస్తుత పరిస్థితి ఉండేది కాదని అన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కరోనా మహమ్మారి కోసం తీసుకున్న జాగ్రత్తలపై కేసీఆర్ తో సూటిగా సవాల్ అడగడానికి రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వ ఆసుపత్రుల తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు