తప్పు కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ నాటకాలు

 తప్పు కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ నాటకాలు

నిరుద్యోగులు, రైతులు, దళితులను మోసం చేసిన సీఎం కేసీఆర్ కు చావుడప్పు కొట్టి దిష్టిబొమ్మ తగలబెట్టాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో బీజేపీ జిల్లా స్థాయి కార్యకర్తల శిక్షణ శిబిరం రెండో రోజున ఆయన పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో తన తప్పు కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ చావు డప్పు అంటూ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. పరిపాలన చేతకాకుంటే రాష్ట్రాన్ని కేంద్రానికి అప్పగించాలని డిమాండ్ చేశారు ఈటల. 

మరిన్ని వార్తల కోసం

కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలి

బూస్టర్ డోసుకు అనుమతివ్వండి