ఎల్బీనగర్ టిమ్స్ కు భూమి పూజ చేసిన కేసీఆర్

ఎల్బీనగర్ టిమ్స్ కు భూమి పూజ చేసిన కేసీఆర్

హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని గడ్డిఅన్నారంలో టిమ్స్ హాస్పిటల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మంత్రులు హరీష్, సబిత, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, స్థానిక ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు.  గడ్డి అన్నారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం ప్రభుత్వం రూ. 900 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.  ఎల్బీనగర్ నుంచి సనత్ నగర్ వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అల్వాల్లో హాస్పిటల్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు కేసీఆర్.

తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో సిటీలో 3 హాస్పిటళ్లకు నిర్మాణానికి ప్లాన్ చేసింది ప్రభుత్వం. ఇప్పటికే వీటి నిర్మాణానికి 2 వేల 679 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో హైదరాబాద్ నలు వైపులా సూపర్ స్పెషాలిటీ దవాఖాలను నిర్మిస్తోంది సర్కార్. అల్వాల్, ఎల్బీనగర్, సనత్ నగర్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను ఏర్పాటు చేస్తోంది.