రాష్ట్రంలో కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు: సీఎం కేసీఆర్

రాష్ట్రంలో కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు: సీఎం కేసీఆర్

రాష్ట్రంలో కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. మంగ‌ళ‌వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో సీఎం మాట్లాడుతూ… ఇప్పటి వరకు రాష్ట్రంలో 1096 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని, 29 మంది క‌రోనా బారిన పడి మ‌ర‌ణించార‌ని అన్నారు. 628 మంది డిశ్చార్జ్ అయ్యాయ‌ని చెప్పారు. ప్రస్తుతం 439 మంది చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు.
ప్ర‌స్తుతం తెలంగాణలో డెత్‌ రేట్‌ 2.64శాతం, రికవరీ రేట్‌ 57.3శాతం ఉంద‌ని సీఎం అన్నారు. క‌రోనా క‌నిపించ‌ని శత్రువని, ప్రజలు స్వీయనియంత్రణ పాటించాలన్నారు. కరోనాను జీరోకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నార‌న్నారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌కు సహకరించాలని , కొద్ది రోజులు ఓపిక ప‌డితే మంచి ఫ‌లితాలు వ‌స్తాయని చెప్పారు.