ఎస్సీ కార్పొరేషన్తో బాగుపడ్డోడు ఒక్కడు కూడా లేడని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా అన్నారు. అసెంబ్లీలో దళితబంధుపై చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దళితులపై ఇంకా వివక్ష కొనసాగుతోంది. వారికి తగినన్ని అవకాశాలు అందడం లేదు. స్వాతంత్రం ముందు నుంచే దళితులు వివక్షకు గురయ్యారు. ఎస్సీ కార్పొరేషన్ తో బాగుపడ్డోడు ఒక్కడు కూడా లేడు. మళ్లీ మా ప్రభుత్వమే వస్తది. వచ్చే బడ్జెట్లో దళితబంధుకు రూ. 20 వేల కోట్లు కేటాయిస్తాం’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
see more