గేమ్స్​ ఆడొద్దన్నందుకు​ స్టూడెంట్​ సూసైడ్

గేమ్స్​ ఆడొద్దన్నందుకు​ స్టూడెంట్​ సూసైడ్

ఎల్బీనగర్, వెలుగు: మొబైల్​గేమ్స్​ఎక్కువగా ఆడొద్దని పేరెంట్స్​ మందలించడంతో ఓ ఇంటర్ ​స్టూడెంట్ సూసైడ్​ చేసుకుంది. మీర్‌‌‌‌‌‌‌‌పేట్​ సీఐ మహేందర్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌‌‌‌‌‌‌‌పేట్​సర్వోదయ నగర్‌‌‌‌‌‌‌‌ కాలనీలో ఉండే కౌశికి(17) ఇంటర్మీడియెట్​చదువుతోంది. ఆదివారం రాత్రి ఫోన్‌‌‌‌‌‌‌‌లో గేమ్స్‌‌‌‌‌‌‌‌ ఆడుతుండగా ఆమె తండ్రి మందలించాడు. దాంతో మనస్తాపానికి గురైన కౌశికి తన గదిలోకి వెళ్లి ఉరివేసుకుంది. గదిలోకి వెళ్లిన కొద్దిసేపటికి తలుపు తీయకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు కిటికీ అద్దాలు పగలగొట్టి చూడగా ఫ్యాన్‌‌‌‌‌‌‌‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఉస్మానియా హాస్పిటల్​కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.