సోమవారం సీఎం కేసీఆర్ సంగారెడ్డి పర్యటన

సోమవారం సీఎం కేసీఆర్ సంగారెడ్డి పర్యటన

సంగారెడ్డి : ఈ నెల 21న సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. నారాయణ ఖేడ్ లో నిర్మించనున్న సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. 

బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను సింగూరుకు అనుసంధానం చేయనున్నారు. సింగూరు బ్యాక్ వాటర్ నుంచి ఎత్తిపోతల ద్వారా బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టుకు నీటిని తరలించనున్నారు. రూ.1,074కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ద్వారా నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో లక్షా 37వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. 

For more news..

ముగిసిన మేడారం మహాజాతర.. వనంలోకి జన దేవతలు

ఆప్ మాజీ నేతకు కేంద్రం భారీ భద్రత