ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 8న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. వనపర్తి నుంచి సీఎం కేసీఆర్ "మన ఊరు - మన బడి" కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనంతో పాటు కన్నెతండా లిఫ్టును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని సీఎంఓ ప్రకటించింది. వనపర్తిలో కొత్తగా నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం వనపర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.
మార్చి 8వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వనపర్తి జిల్లా పర్యటన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రం నుంచి ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు.
— Telangana CMO (@TelanganaCMO) February 28, 2022
మరిన్ని వార్తల కోసం..