ఏప్రిల్ 14 నుంచి బండి సంజయ్ పాదయాత్ర

ఏప్రిల్ 14 నుంచి బండి సంజయ్ పాదయాత్ర

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 14 నుంచి రెండో విడత పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు బండి సంజయ్ చెప్పారు. మొదటి విడతలో 36 రోజుల పాటు పాదయాత్ర సాగగా.. ఈ సారి 200 రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించారు. మొత్తం ఐదు విడతలుగా ఆయన పాదయాత్ర చేయనున్నారు. కరోనా దృష్ట్యా ఆలస్యమైన రెండో విడత యాత్రను జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి ప్రారంభించనున్నారు.

For more news..

మార్చ్ 7 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

కష్టపడ్డోళ్లకే కాంగ్రెస్‌లో కుర్చీ వేసి కూర్చోబెడ్తరు