హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 14 నుంచి రెండో విడత పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు బండి సంజయ్ చెప్పారు. మొదటి విడతలో 36 రోజుల పాటు పాదయాత్ర సాగగా.. ఈ సారి 200 రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించారు. మొత్తం ఐదు విడతలుగా ఆయన పాదయాత్ర చేయనున్నారు. కరోనా దృష్ట్యా ఆలస్యమైన రెండో విడత యాత్రను జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి ప్రారంభించనున్నారు.
ఏప్రిల్ 14, 2022 నుండి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర#PrajaSangramaYatra pic.twitter.com/9iHNQF6WRP
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 28, 2022